Saturday, April 20, 2024

బావిలో మృతదేహం… బయటకు తీసిన ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

Dead body taken from well by SI in vikarabad

వికారాబాద్: బావిలో ఉన్న మృతదేహాన్ని ఎస్‌ఐ బయటకు తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొత్లూపూర్ గ్రామానికి చెందిన నర్సింహులు (30) అనే వ్యక్తి హోలీ వేడుకులు ఘనంగా జరుపుకున్నాడు. దేహం మొత్తం రంగులతో నిండిపోవడంతో బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు బావిలో పడి చనిపోయాడు. బావి పురాతనమైనది కావడంతో ఎవరు దిగడానికి సాహసించలేదు. ఎస్‌ఐ ఏడు కొండలు నడుముకు తాడు కట్టుకొని బావిలోకి దిగాడు. అనంతరం బావిలో నుంచి మృతదేహాని బయటకు తీశాడు. దీంతో గ్రామస్థులు ఎస్‌ఐని అభినందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News