Friday, April 26, 2024

క్రికెట్ బెట్టింగ్‌తో చనిపోతున్నాం… సెల్ఫీ వీడియో

- Advertisement -
- Advertisement -

గుంటూరు: క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకోవడంతో చనిపోతున్నామని ఇద్దరు యువకులు సెల్ఫీ వీడియోలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో జరిగింది. ఊర సురేష్, కొమురయ్య క్రికెట్ బెట్టింగ్‌లో లక్ష రూపాయలు కోల్పోయారు. వాళ్ల చేతిలో రూ. 30 వేలు ఉండడంతో బెట్టింగ్ నిర్వహకునికి ఇచ్చారు. మరో రూ. 70 వేల రూపాయలు చెల్లించాలని బెట్టింగ్ నిర్వహకుడు బలవంతం చేయడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి సెల్పీ వీడియోలు పంపించారు. బంధువులు విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కన్నుమూయగా కొమురయ్య పరస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News