Friday, March 29, 2024

ఎపిని అప్పుల రాష్ట్రంగా మార్చింది బాబే: మంత్రి కారుమూరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: బిసిలకు సిఎం జగన్ మోహన్ రెడ్డి వెన్నుదున్నుగా ఉన్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర్ రావు తెలిపారు. అన్ని పదవుల్లో బిసిలకు సిఎం జగన్ పెద్దపీట వేశారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో బిసిలను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. బిసిల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు లేదన్నారు. చంద్రబాబు పనంతా దాచుకోవడం.. దోచుకోవడమేనని కారుమూరి మండిపడ్డారు. మళ్లీ దోచుకోవడానికి బాబు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబేనని, పోలవరం నిధులను బాబు ఎటిఎంలా వాడుకున్నారని ప్రధాని మోడీ అన్నారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News