Friday, April 26, 2024

కొత్త ఐపిఎల్ జట్టుకు బిడ్ వేయనున్న దీపికా, రణ్‌వీర్

- Advertisement -
- Advertisement -

Deepika Ranveer for IPL bid
ముంబయి: అక్టోబర్ 25 జరుగనున్న ఐపిఎల్ వేలం పాట నుంచి దాదాపు రూ. 7000 నుంచి 10000 కోట్ల వరకు వసూలు కావచ్చని బిసిసిఐ భావిస్తోంది. ఈసారి ఐపిఎల్ ఫ్రాంఛైజ్‌కు నటులు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ కూడా వేలం పాడనున్నారు. మాన్‌ఛెస్టర్ యునైటెడ్ ఓనర్లు లక్నో, అహ్మదాబాద్ టీమ్‌లకు బిడ్ చేయనున్నారని సమాచారం. కాగా అదానీ గ్రూప్ అహ్మదాబాద్ ఫ్రాంఛైజ్‌కు బిడ్ వేయనున్నదని రిపోర్ట్. ఇదిలావుండగా ఐపిఎల్ బిడ్ డాకుమెంట్ ఖరీదు రూ. 10 లక్షలు, అయితే రూ. 3000 కోట్లు వార్షిక టర్నోవర్ ఉన్న సంస్థలు, కన్‌సోర్టియమ్స్‌ను మాత్రమే లీగ్ అనుమతించనున్నది. కాగా ఐపిఎల్ టీమ్స్ కనీస ధర(బేస్ ప్రైస్) రూ. 2000 కోట్లు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News