Tuesday, April 23, 2024

బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Young boy attempts Suicide in Manikonda

 

నల్లగొండ: బైక్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తిప్పర్తి మండల కేంద్రంలో పోలెబోయిన శ్రీనివాస్ అనే కుటుంబం నివసిస్తోంది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. బైక్ కావాలని గత కొన్ని రోజుల నుంచి తండ్రి శ్రీనివాస్‌ను పెద్ద కుమారుడు నవీన్ కోరుతున్నాడు. అప్పులు ఉన్నాయని కొన్ని రోజుల తరువాత కొనిస్తానని, ప్రస్తుతం ఉన్న స్కూటీని వాడుకోవాలని కుమారులకు తండ్రి తెలియజేశాడు. నవీన్ ఎంత మొర పెట్టుకున్న తండ్రి బైక్ కొనివ్వడంలేదని మనస్థాపంతో ఇంట్లో పురుగుల మందు తాగాడు. అనంతరం తన సోదరుడుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సోదరుడు ఇంటి పక్కన వాళ్లకు సమాచారం ఇవ్వడంతో అతడిని నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసియులో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్ ప్రాణాలు విడిచాడు. నవీన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌ఐ మట్టయ్య తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News