Wednesday, April 24, 2024

పరిశ్రమల స్థాపనకు ఇది కీలక ఘట్టం: పట్నం మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Delegation visited industrialized rakamcherla area in Parigi

వికారాబాద్: జిల్లాలో పరిగి నియోజకవర్గంలోని పారిశ్రామికవాడ రాకంచెర్ల ప్రాంతాన్ని సోమవారం ప్రతినిధుల బృందం పరిశీలించింది. రాకంచెర్లలో పరిశ్రమల స్థాపన కోసం టిఎస్ఐ సి చైర్మన్ బాలమల్లు, జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపి డాక్టర్ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తదితరులు పర్యటించి అవసరమైన విధి విధానాల కోసం చర్చించారు. వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఇది కీలక ఘట్టంగా మారుతుందని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి కెటిఆర్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఫలితంగా స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మహేందర్ రెడ్డి అన్నారు.

Delegation visited industrialized rakamcherla area in Parigi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News