Friday, April 26, 2024

రోజంతా సెషన్ కోసం బిజెపి ఎమ్మెల్యేలను మార్షల్ చేసిన ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

- Advertisement -
- Advertisement -

 

Delhi MLAs

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా శుక్రవారం ప్రత్యేక సెషన్‌లోని మొత్తం రోజంతా బిజెపి ఎమ్మెల్యేలందరినీ కాషాయ పార్టీ శాసనసభ్యుడు అజయ్ మహావార్ వీడియో రికార్డింగ్‌పై మార్షల్ చేశారు. ‘చట్టాలకు విరుద్ధంగా అసెంబ్లీ కార్యకలాపాలను వీడియో రికార్డింగ్ చేశారా?’ అని బిర్లా,  మహావార్‌ను అడిగారు. “వీడియో రికార్డింగ్ చేశారా? ఉంటే మీ ఫోన్ ఎందుకు సీజ్ చేయకూడదు, ఇది సభా చట్టాలకు విరుద్ధం” అని ఆమె అన్నారు.

బిర్లా ప్రశ్నలకు మహావార్, అతని పార్టీ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈ అంశంపై ఆప్, బిజెపి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిని అనుసరించి, బిజెపి ఎమ్మెల్యేలు సభ సమయాన్ని వృథా చేశారని, వారిని బయటకు పంపించినట్లు బిర్లా అన్నారు. బిజెపి ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వచ్చి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిలబడి ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించిన వివాదంపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసి, మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News