Saturday, April 20, 2024

ఢిల్లీలో ఒక్క రోజే 50 శాతం పెరిగిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Delhi Covid cases rise again

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల వ్యవధిలో 50 శాతం మేర అధికంగా కేసులు రావడం గమనార్హం. ముందురోజు అక్కడ 202 మందికి కరోనా సోకగా, ప్రస్తుతం ఆ సంఖ్య 299 కి చేరింది. కొవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. మరోపక్క దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్యలో కూడా స్వల్ప పెరుగుదల కనిపించింది. గురువారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం బుధవారం 4.34 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 1,007 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ముందు రోజుకంటే ఏడు శాతం అధికంగా కేసులు వచ్చాయి. బుధవారం దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క మరణం నమోదైంది. ఆ ఒక్కటి కూడా మహారాష్ట్రలో రికార్డయింది. 818 మంది కోలుకోగా, రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య 11,058 ( ౦.౦౩) గా ఉంది. బుధవారం 14.48 లక్షల మంది టీకా తీసుకోగా, ఇప్పటివరకు 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News