Thursday, April 25, 2024

30మంది పిల్లలను రేప్ చేసి చంపిన సైకో.. చివరికి ఏమైందంటే..?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అభం శుభం తెలియని 30మంది చిన్నారులను రేప్ చేసి దారుణంగా హతమార్చిన ఓ సైకో కిల్లర్ కు దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళితే.. 2015లో ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన కేసులో 32 ఏళ్ల రవీంద్ర కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విచారణలో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2008 నుంచి 2015 సంవత్సరం మధ్య దాదాపు 30మంది చిన్నారులను రేపు చేసి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

చిన్నారులకు పైసలు, చాక్లెట్స్ ఆశ చూపి.. వారిని నిర్మానుశ బిల్డింగ్ లోకి, పొలాల్లోకి ఎత్తుకెళ్లి రేప్ చేసి, తర్వాత వారు ఎవరికైన చెబుతారనే భయంతో దారుణంగా చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు హతమార్చిన వారిలో రెండేళ్ల చిన్నారి నుంచి 12ఏళ్ల బాలిక వరకు ఉన్నట్లు తెలిపారు. సీడిలో సెమి పోర్న్ హర్రర్ సినిమాలు చూసి సైకోగా మారి ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారం అనంతరం హత్య చేసిన ఘటనలో గురువారం రోహిణి కోర్టు తీర్పు వెల్లడిస్తూ నిందితుడికి జీవిత కాల జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News