- Advertisement -
సూర్యాపేట: రైతులు రాజులు కావాలని సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కోదాడలో నియంత్రిత సాగుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే సాగు చేయాలని సూచించారు. నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎంఎల్ఎ మల్లయ్య యాదవ్లు పాల్గొన్నారు.
- Advertisement -