Tuesday, March 19, 2024

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహశీల్దార్ మృతి

- Advertisement -
- Advertisement -

Deputy Tahsildar killed in Road Accident in Anakapalle

అమరావతి: అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జిల్లా మండలంలోని శంకరం వద్ద హైవేపై ముందు వెళ్తున్న లారీని ఇన్నోవా కారు ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పిన బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిప్యూటీ తహశీల్దార్ సతీష్ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇన్నోవా కారు విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Deputy Tahsildar killed in Road Accident in Anakapalle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News