Wednesday, April 24, 2024

తెలంగాణలో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించాలి: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై ప్రేమ ఉంటే నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 14న ప్రారంభించాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలు సక్రమంగా భర్తీ చేయలేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని తిట్టేందుకే బిఆర్‌ఎస్ సభ పెట్టినట్లు ఉందన్నారు. బహిరంగ సభలో పాల్గొన్న అతిథులందరూ ప్రధాని మోడీని తిట్టడం, బిజెపిని బదనాం చేయడం తప్ప ఏమీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News