Thursday, April 25, 2024

నలుగురు ఐపిఎస్‌లకు డిజిపి హోదా

- Advertisement -
- Advertisement -

DGP status for four IPS officers

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు డిజిపిలుగా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర సిపిఅంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్, గోవింద్ సింగ్, రవిగుప్తాలకు డిజిపి హోదా కల్పిస్తున్నట్లు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంజనీ కుమార్ హైదరాబాద్ సీపీగా డీజీపీ హోదాలో కొనసాగుతున్నారు. గతంలోనే ఈ పోస్టును మహేందర్ రెడ్డి సీపీగా ఉన్నప్పుడు అదనపు డీజీ నుంచి డీజీపీ స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఐపీఎస్ రవిగుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గోవింద్ సింగ్ సీఐడీ డీజీగా పనిచేస్తున్నారు. ఉమేశ్ షరాఫ్ పోలీస్ శాఖ సంక్షేమ విభాగం అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఇప్పటి వరకు అదనపు డీజీ హోదాలో ఉన్నారు. తాజాగా వెలువడిన ఉత్తర్వుల మేరకు నలుగురు అధికారులు డీజీ హోదాలో కొనసాగుతారు. ఇదిలావుండగా పదోన్నతులు లభించిన ఐపీఎస్‌లతో పాటు మిగతా పోలీసు అధికారుల బదిలీ అనతికాలంలో జరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News