Friday, April 26, 2024

చాలా ఆనందంగా ఉంది

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ధనుష్, సెన్సిబుల్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు కలిసి వర్క్ చేయనున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందించనున్నారు. నారాయణ్ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. దివంగత సునీతా నారంగ్ జయంతి సందర్భంగా శుక్రవారం అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. త్రిభాషా చిత్రంగా తెలుగు, తమిళం, హిందీలో భారీ స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది.

ఈ నేపథ్యంలో శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్ కె. నారంగ్, పి.రామ్‌మోహన్ రావులతో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో ఆసక్తికరంగా ఉందని హీరో ధనుష్ అన్నారు. “నేను ఆరాధించే దర్శకులలో ఒకరైన శేఖర్ కమ్ముల సార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ త్రిభాషా చిత్రం కోసం ఎస్వీసీఎల్‌ఎల్పీ బ్యానర్‌లో నారాయణ దాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావులతో చేతులు కలపడానికి సంతోషిస్తున్నాను. దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని ధనుష్ ట్వీట్ చేశాడు. కాగా ధనుష్ తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రైయిట్ మూవీ ఇదే కావడం విశేషం.

Dhanush tweet on Shekhar Kammula Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News