Tuesday, April 16, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ, రైనా

- Advertisement -
- Advertisement -

Dhoni Announces Retirement from International Cricket

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అనూహ్యంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కెరీర్ సాంతం న‌న్ను ప్రేమించి, నాకు మద్దతుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. 19:29 నుంచి నేను వీడ్కోలు ప‌లికిన‌ట్లుగా భావించండి’ అని పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్ పై ఏడాది కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది. 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత నుంచి ధోనీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో ధోనీ క్రికెట్ వీడ్కోలు పలుకనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇన్నిరోజుల తర్వాత స్పందించిన ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.కాగా, ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపటికే సురేష్ రైనా కూడా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

Dhoni Announces Retirement from International Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News