Thursday, April 25, 2024

బీపీ మందులతో మధుమేహం నుంచి రక్షణ

- Advertisement -
- Advertisement -

బ్రిటన్ శాస్త్రవేత్తల అధ్యయనం


లండన్ : అధిక రక్తపోటును నియంత్రించేందుకు వాడే ఔషధాలు భవిష్యత్తులో మధుమేహం తలెత్తకుండా రక్షణ కల్పిస్తాయని పరిశోధకులు గుర్తించారు. హైబీపీ కారణంగా పక్షవాతం, గుండెపోటు తలెత్తే ముప్పు ఉంటుంది. బీపీ నియంత్రణకు ఔషధాలను వాడడం వల్ల ఈ ఇబ్బందులు చాలా వరకు దూరమవుతాయి. అధిక రక్తపోటు మధుమేహానికి దారి తీసే పరిస్థితి ఉన్నందున బీపీ మందులతో ఈ సమస్య తగ్గుతుందా ? అన్న అంశంపై ఇప్పటివరకు నిగూఢ పరిశోధనలేవీ జరగలేదు.

దీంతో ఈ అంశంపై ఆక్స్‌ఫర్డ్ క్రిస్టల్ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు , బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ పరిశోధకులు భారీ అధ్యయనం చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ క్లినికల్ పరీక్షల్లో పాల్గొన్న 1,45,000 మంది ఆరోగ్య వివరాలను సేకరించారు. వీరి ఆరోగ్య పరిస్థితులను నాలుగైదు సంవత్సరాల పాటు ఎప్పటికప్పుడు గమనిస్తూ విశ్లేషిస్తూ వచ్చారు. సిస్టాలిక్ రక్తపోటు 5 ఎంఎంహెచ్‌జీ ( మిల్లీమీటర్ హై) మేర తగ్గితే .. టైప్ 2 మధుమేహం ముప్పు 11 శాతం తగ్గుతుందని గుర్తించారు. జీవనశైలి మార్పులు, రక్తపోటు నియంత్రణ ఔషధాలలో ఈ లక్షాన్ని సులభంగానే సాధించ వచ్చని వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ది లాన్సెట్ పత్రిక అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News