- Advertisement -
ములుగు: డయాగ్నొస్టిక్ సెంటర్ ఏర్పాటుతో గిరిజనులకు ఎంతో ఉపయోగకరమని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ములుగులో డయాగ్నొస్టిక్ సెంటర్ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిఎంకెసిఆర్ ఆదేశాల మేరకు డయాగ్నొస్టిక్ కేంద్రాలు ప్రారంభమయ్యాయన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు.
- Advertisement -