Friday, April 26, 2024

హైదరాబాద్, వరంగల్ లో డయాలసిస్ కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

 

ఆరోగ్య శ్రీ సమీక్షలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్:  వ్యాధిగ్రస్తులైన ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలిసిస్ సేవలు అందించాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. హైదరాబాద్ ఒక కిడ్నీ డయాలసిస్ కేంద్రం, వరంగల్ లో మరో కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.ఈ రెండు కేంద్రాల్లో ఐదు బెడ్స్, ఎయిడ్స్‌ పేషంట్లకు, ఐదు బెడ్స్ హెపటైటిస్ పేషంట్లకు కేటాయించి‌ డయాలసిస్ సేవలు అందించాలని సూచించారు. వెంటనే ఈ రెండు‌ కేంద్రాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు‌ చేసి సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కిడ్నీ వ్యాధిగ్రస్థులకు డయాలిసిస్ చేయించకోవడం ఆర్థికంగా చాలా భారంగా పరిణమించిన నేపధ్యంలో సీఎం కేసీఆర్ గారు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 10 వేల మంది రోగులకు డయాలిసిస్ సేవలు అందుతున్నాయని చెప్పారు. సంవత్సరానికి ఇందు కోసం 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు.ఈ క్రమంలో కిడ్నీ వ్యాధితో బాదపడే ఎయిడ్స్, హెపటైటిస్ పేషంట్లకు సైతం సీఎ కేసీఆర్ గారి‌ఆలోచన మేరకు డయాలసిస్‌ సేవలు ఉచితంగా అందించాలన్నారు.

పేషంట్ల సంఖ్యకు తగినట్టుగా డయాలిసిస్ మెషీన్లను ఏర్పాట్లను చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని, ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ వ్యాధి గ్రస్తులకు డయాలిసిస్ కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్‌ డైరెక్టర్ ప్రీతీ మీనా, ఓఎస్డీ‌ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News