లక్ష్, దిగంగన సూర్యవంశీ జంటగా రమేష్ కదుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వలయం’. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ దిగంగన మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమాలో నేను దిశా అనే ఓ సాంప్రదాయబద్దమైన గృహిణి పాత్ర చేశాను. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దిశా అనుకోకుండా కనిపించకుండా పోతుంది. అసలు దిశా ఏమైంది? తాను ఎందుకు కనిపించడం లేదు? తనకు ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా? అన్న సస్పెన్స్లో కథ నడుస్తుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య కనిపించకుండా పోవడంతో హీరో సమస్యలలో చిక్కుకుంటాడు. ఆయన చుట్టూ ఉన్న వారు భార్య గురించి తప్పుగా మాట్లాడుతుంటే అసలు నిజంగా ఏమైంది..? అని బాధపడతాడు. అందుకే దీనికి ‘వలయం’ అనే టైటిల్ పెట్టాము. ఇక ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘సిటీమార్’ సినిమాలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో నేను ఆయన పక్కన ఒక హీరోయిన్గా నటిస్తున్నాను”అని అన్నారు.