Friday, April 19, 2024

ప్రశాంతంగా, ఆనందంగా చూసే సినిమా

- Advertisement -
- Advertisement -

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “నిజ జీవితంలో ఒక అమ్మాయిని చూసి ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నాను. నా ఫస్ట్ మూవీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకున్నాను . ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నాను.

ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూమి అన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయి. ఎదుటివాళ్లని ఎంత గౌరవిస్తుందో వాళ్ల నుంచి అదే గౌరవాన్ని కోరుకుంటుంది. ఈ సినిమాలో హీరో పేరు ఆకాష్. పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాల హృదయం ఉన్న వ్యక్తి. తను ఓ ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే లైఫ్‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు. ఇప్పుడున్న అమ్మాయిలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అబ్బాయిలకూ కనెక్ట్ అవుతుంది. ఎలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చుతారనేది ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. థియేటర్‌లో ప్రశాంతంగా, ఆనందంగా నవ్వుతూ చూసే సినిమా ఇది” అని తెలిపారు.

Director Laxmi Sowjanya About ‘Varudu Kaavalenu’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News