Thursday, April 25, 2024

వర్మ దిశ సినిమా నిలిపివేయాలి

- Advertisement -
- Advertisement -

Disha father concerns in front of Ram Gopal Varma office

 

దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ ః దిశ ఎన్‌కౌంటర్ ’ సినిమా విడుదల నిలిపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి శ్రీధర్‌రెడ్డి ఆదివారం ఉదయం దర్శకుడు రాంగోపాల్‌వర్మ కార్యాలయం ఎదుట ఆయన ధర్నాకు దిగారు. ఆయన వెంట పలువురు మహిళలు, స్నేహితులు ఉన్నారు. వారంతాదిశ సినిమాను ఆపాలనిడిమాండ్ చేశారు. దిశ మరణంతో తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దిశ కుటుంబాన్ని వర్మ తన సినిమాతో మరింత ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధితుల ఎమోషన్లను డబ్బు చేసుకోవాలన్న దర్శకుడు వర్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశపై లైంగిక దాడి ఘటనకు సంబంధించి దర్శకుడు రాంగోపాల్వర్మనిర్మిస్తున్న సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌బోర్డును ఆదేశించాలంటూ శ్రీధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దిశపై లైంగిక దాడి, హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా నిర్మాణం చేపట్టడం సరికాదని ఈమేరకు శ్రీధర్‌రెడ్డి తరఫు న్యాయవాది నివేదించారు. అయితే ఈ సినిమా నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌ఎటువంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలసిటర్ జనరల్ రాజేశ్వరరావు నివేదించారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును దిశ తండ్రి వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయంతీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News