- Advertisement -
హైదరాబాద్ ః పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్గా పనిచేస్తున్న కే బాలచందర్ను సర్వీసు నుంచి తొలగిస్తూ హైకోర్టు గురువారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. కొంత కాలంగా పెద్దపల్లిలో పని చేస్తున్న బాల చందర్, గతంలో రంగారెడ్డి జిల్లా మేడ్చల్లోని 6వ జూనియర్ సివిల్ జడ్జి, మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్గా పని చేసిన కాలంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమగ్రంగా విచారణ చేయించింది. ఈ క్రమంలో ఆరోపణలు రుజువు కావడంతో ఆయన్ను సర్వీసు నుంచి పూర్తిగా తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాలచందర్ స్థానంలో కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్(స్పెషల్ మొబైల్ కోర్టు)గా పనిచేస్తున్న ఎం. రాజును నియమిస్తూ కరీంనగర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
Dismissed from Pedapally Junior Civil Judge Service
- Advertisement -