Thursday, April 25, 2024

పేషెంట్ కాళ్లు పట్టి లాక్కెళ్లిన ఘటనపై జిజిహెచ్‌లో డిఎంఈ విచారణ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్‌ : పేషెంట్ కాళ్లు పట్టి లాక్కెళ్లిన ఘటనపై నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు ముగ్గురు సభ్యులు గల డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఈ) బృందం చేపట్టింది. మార్చి 31న నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు బోధన్‌కు చెందిన హన్మాండ్లు అనే పేషెంట్‌ను కాళ్లు పట్టుకొని లాక్కెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించించిన విషయం తెలిసిందే. ఈఘటనపై ముగ్గురు సభ్యుల బృందం విచారణ చేపట్టింది.

ఈనెల 14న ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు నిజామాబాద్‌కు వచ్చారు. ఘటన జరిగిన తీరు నిజా నిజాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా ఆసుపత్రి అధికారులు, సిబ్బందికి తెలియకుండా రెండు అంతస్తులో రహాస్య విచారణ చేపట్టారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో విచారణ చేపట్టారు.

సంబంధిత నివేదికను డిఎంఈకి సమర్పిస్తామని విచారణ అధికారులు తెలిపారు. జిజిహెచ్‌లో రోగి నిర్లక్ష వైద్యంపై డిఎంఈ విచారణ అంశాన్ని ఆసుపత్రి అధికారులు పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడంతో బృందం సభ్యులు ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News