Friday, April 19, 2024

దోమలగూడలో వైద్య దంపతులకు కరోనా

- Advertisement -
- Advertisement -

corona positive

 

హైదరాబాద్: తెలంగాణలో దంపతులైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరుకున్నాయి. దోమలగూడలో ఉండే దంపతులైనా డాక్టర్లకు కరోనా సోకిందని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన వ్యక్తికి కూడా కరోనా వచ్చిందని తెలిపింది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తితో కలిసి ఉండడంతో కుత్బుల్లాపూర్ వ్యక్తికి కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. భారత్ లో ఇప్పటి వరకు 694 మందికి కరోనా పాజిటివ్ రాగా 13 మంది మృతి చెందారు. ఇవాళ ఒక్కరోజే 24 మందికి కరోనా సోకినట్టు కేంద్రం వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు 4,73,308 మందికి కరోనా సోకగా 21,344 మంది మృత్యువాతపడ్డారు. ఇటలీ (7503), స్పెయిన్ (3647), చైనా(3287), ఇరాన్ (2077), ఫ్రాన్స్ (1331), అమెరికా(1032), యుకె(435) మంది మృతి చెందారు.

Courtesy by worldometers.info

 

 

 

Doctor couple corona positive cases in Telangana,

 

Two doctors corona positiva cases in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News