మన తెలంగాణ/రాజేంద్రనగర్ : గుర్తు తెలియని దుండగులు ఓ డాక్టర్ను కిడ్నాప్ చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టించింది. బురకాలు ధరించి గుర్తు పట్టకుండా జాగ్రత్త పడిన దుండగులు, డాక్టర్ సహాయకునికి నోటికి ప్లాస్టర్ వేసి బాత్ రూమ్లో బంధించి కిడ్నాప్కు పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్గాఖలీజ్ఖాన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. కిడ్నాప్కు గురైన డాక్టర్ కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం… ఆరెమైసమ్మ దేవాలయం నుంచి హిమాయత్సాగర్ వెళ్లె మార్గంలో ఎక్సైజ్ అకాడమీ సమీపంలో దర్గాఖలీజ్ఖాన్ వద్ద ప్రెస్టీజ్ విల్లాస్ ఉన్నాయి. ఈ విల్లాలో నివాసం ఉండే డాక్టర్ బహజాట్ హుస్సేన్ (57) ఆ సమీపంలోనే అపార్టుమెంట్లో ఓ క్లినిక్ నిర్వహిస్తున్నాడు.
ఇదిలా ఉం డగా మంగళవారం సాయంత్రం డాక్టర్ ఉన్న అపార్టుమెంట్ వద్దకు బురకాలు ధరించి వచ్చిన దుండగులు లోకిని ప్రవేశించి డాక్టర్ వద్ద సహాయకుడిగా పని చేస్తు న్న వ్యక్తిని చితకబాది అతని నోటికి ప్లాస్టర్ అంటించి బాత్రూమ్లో బంధించి డాక్టర్ను కిడ్నాప్ చేశారు. బాత్రూమ్ నుంచి బయటపడిన డాక్టర్ సహాయకుడు డాక్టర్ హుస్సేన్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వా రు చుట్టు పక్కల గాలించి హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసుల సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి ఎపి9 వై0031 కారులో డాక్టర్ కిడ్నాప్కు గురైనట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సైబారాబాద్ సీపీ సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ అశోకచక్రవర్తి కిడ్నాప్ జరిగిన ప్రదేశానికి వచ్చి వివరాలు సేకరించారు. సీపీ కిడ్నాప్ను ఛేదించడానికి పోలీసులు బలగాలను వెంటనే రం గంలోకి దింపినట్లు తెలుస్తుంది. కానీ, ఆ వివరాలు పోలీసులు అధికారులు వెల్లడించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు.