- Advertisement -
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రముఖ వైద్యుడు, నిలోఫర్ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ పి. సుదర్శన్రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా సుదర్శన్రెడ్డి మంచి గుర్తింపు పొందారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖు సంతాపం తెలిపారు. వైద్యరంగానికి ఆయన చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నిలోఫర్ వైద్యులు, సిబ్బంది మాట్లాడుతూ ఆయన నిబద్దతలో కూడిన వ్యక్తియని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆయన ప్రేమ చూపి ఎంతో శ్రమించి చిన్నారులకు ప్రాణం పోసేవాడని, ఆయనను మిగతా వైద్యులు ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో నిలిచిపోవాలని పేర్కొన్నారు.
Doctor Sudarshan Reddy passed away
- Advertisement -