Friday, April 19, 2024

వృద్ధురాలిపై శునకాల దాడి… శవాన్ని పీక్కుతిని…

- Advertisement -
- Advertisement -

Dogs killed old women in Karnataka

బెంగళూరు: రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలుపై కుక్కలు దాడి చేసి అనంతరం ఆమె శవాన్ని పీక్కుతిన్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులోని ఆర్ ఆర్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ద్వారకానగర్‌లో రాత్రి పది గంటల సమయంలో ఓ వ్యక్తి వెంట పది కుక్కలు వెంబడించడంతో అతడు 500 మీటర్లు పరుగెత్తి తప్పించుకున్నాడు. రాత్రి 11.30 గంటల సమయంలో వృద్ధురాలు ఒంటరిగా నడుస్తోంది.  పది శునకాలు ఆమెపై దాడి చేయడంతో కింద పడిపోయింది. ఆమె గొంతును శునకాలు కొరకడంతో వృద్ధురాలు చనిపోయింది. మృతదేహాన్ని కొంత దూరం లాక్కెళ్లి శునకాలు పీక్కుతిన్నాయి. లాక్‌డౌన్‌తో శునకాలకు ఆహారం దొరక్క ఇలా చేసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News