Wednesday, April 24, 2024

భారత్‌లో కొనసాగుతున్న ట్రంప్ రెండో రోజు పర్యటన

- Advertisement -
- Advertisement -

Donald-Trump

న్యూఢిల్లీ: భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30కి రాజ్ ఘాట్ లో మహాత్మగాంధీకి ప్రధాని మోడీ, ట్రంప్ నివాళులు అర్పించారు. 11 గంటలకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మోడీ – ట్రంప్ లు భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు చర్చించచున్నారు. మంగళవారం ట్రంప్, భారత ప్రధాని మోడీ బేటీలో భారత్- అమెరికా మధ్య మూడు బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పదం జరిగే అవకాశముంది.  24MH-60 రోమియో, ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుందని తెలుస్తోంది. నేవీకి రోమియో, ఆర్మీకి అపాచీ హెలికాప్టర్లను ఇవ్వనున్నారు.  కాగా ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ను ట్రంప్ దంపతులు సందర్శించగా.. వారికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలు ఘనస్వాగతం పలికారు.

Donald Trump in India LIVE Updates

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News