- Advertisement -
బాగ్దాద్ : బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతు ఆందోళనకారులు దాడి జరపడంతో అమెరికా భగ్గు మంది. మంగళవారం అమెరికా విమాన దాడులకు రెండు డజన్ల మంది పోరాటయోధులు మరణించడంతో ఆందోళన కారులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఇరాక్ నుంచి అమెరికా బలగాలు తొలగి పోవాలని డిమాండ్ చేశారు. అమెరికన్లు చనిపోతే దానికి తగిన శిక్ష ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహ్రాన్ను హెచ్చరించారు. మరణాలకు ఇతర నష్టాలకు ఇరాన్ పూర్తి బాధ్యత వహించక తప్పదని ట్రంప్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ఇది హెచ్చరిక కాదని, బెదిరింపు అని పేర్కొన్నారు.
Donald Trump warns Iran of big price for attacks
- Advertisement -