Thursday, March 28, 2024

కాసేపట్లో అహ్మదాబాద్ కు చేరుకోనున్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

trump
హైదరాబాద్: రెండు రోజుల పాటు భారత్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం.11.40 గంటలకు అహ్మదాబాద్ విమానాశ్రయానికి ట్రంప్ చేరుకోనున్నారు. ట్రంప్ దంపతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఇరువురు నేతలు 22 కిలీమీటర్ల మేర భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం.12.15 గంటలకు సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ సభకు హాజరుకానున్నారు. నమస్తే ట్రంప్ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆగ్రాకు ట్రంప్ దంపతులు బయల్దేరనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు తాజ్‌మహల్‌ను ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. సాయంత్రం.6.45 గంటలకు ఆగ్రా నుంచి తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు. ట్రంప్ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా డిఆర్‌డిఒ డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు చేశారు. ట్రంప్ భద్రతా విధుల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా సేవలు అందించనుంది.

 

Donald Trump will be reached as soon as in Gujarath
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News