- Advertisement -
హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సహాయనిధికి లక్ష రూపాయల వంతున సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తనవంతు విరాళాన్ని తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్, ఎపి భవన్ అధికారి దేవేందర్లకు అందజేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయనిధికి కూడా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. చెక్కులను అందజేస్తూ జస్టిస్ రమణ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ ఆపత్సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా అందరూ తూచా తప్పకుండా ఈ మహమ్మారిని పారద్రోలటానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Donated by Justice NV Ramana
- Advertisement -