Friday, March 29, 2024

నేటితో ముగియనున్న దోస్త్ రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

DOST registrations ends today

 

హైదరాబాద్ : దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు శనివారంతో ముగియనుంది. శుక్రవారం నాటికి 1,71,485 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి తెలిపారు. అందులో 1,67,366 మంది ఫీజు చెల్లించగా, 1,39,076 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీన సీట్లు మొదటి విడత కేటాయించనున్నట్లు వెల్లడించారు. మొదటి విడత సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1 నుంచి 5 వరకు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అన్నారు. దోస్త్ రెండవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ఆగస్టు 1 ప్రారంభించనున్నట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News