- Advertisement -
సూర్యాపేట: సిఎం కెసిఆర్ సంకల్పం మేరకే డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తిరుమలగిరిలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. 80 డబుల్ బెడ్ రూమ్లను లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి అందజేసిన సందర్భంగా మాట్లాడారు. డబుల్బెడ్రూం ఇండ్ల నాణ్యతలో ఎలాంటి రాజీ పడలేదని, డబుల్ బెడ్ రూం లబ్ధి దారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -