Tuesday, April 16, 2024

మంత్రి పిఆర్‌ఒపై వరకట్నం కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Dowry case registered against Minister PRO

మన తెలంగాణ/హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి పిఆర్‌ఒ శ్రీకాంత్‌పై ఆదివారం నాడు వరకట్న కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం తన భర్త శ్రీకాంత్ దాడి చేశాడని భార్య కోమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భర్త శ్రీకాంత్ చేతిలో కోమల తీవ్రంగా గాయపడింది. ఆమెకు మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించారు. కోమల స్వగ్రామం మంథని మండలం గాజులపల్లి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News