మియాపూర్: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చిన్నారి ప్రాణాలను బలిగొన్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకంది. మియాపూర్ డీఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ డివిజన్ పరిధిలోని టీఎన్ నగర్లో నివాసముంటున్న అడవయ్య, దుర్గమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దుర్గమ్మ కూలి పనులు చేస్తుండగా అడవయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం అడవయ్య మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
దీంతో దుర్గమ్మ ఆమె పిల్లలు నందిని (1), సునీత (4)లను తీసుకొని ఇట్లోంచి బయటకు వెళుతుండగా అడవయ్య ఎక్కడికి వెళుతున్నావని ప్రశ్నించి మళ్లి గొడప పడ్డాడు. ఆ క్రమంలో వారిద్దరి మధ్యలో గొడవ పెరగడంతో అడవయ్య అక్కడే పక్కన ఉన్న కర్రతో తన పెద్ద కూతురు సునీత తల, ఛాతీపై కొట్టాడు. దీంతో చిన్నారి సునీత అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే సునీతను మియాపూర్లోని ప్రణం హస్పిటల్కు తరలిచంగా వైద్యులు సునీతను పరీక్షించి చనిపోయిందని నిర్థారించారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Drunk Father Beats Daughter With Stick At Miyapur