- Advertisement -
సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 14 టేబుల్స్, 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దుబ్బాలో పోలైన ఓట్లు 1,64,192 గా ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలోని 146 గ్రామాల ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం లోగా ఫలితాలు వచ్చేఅవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -