- Advertisement -
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో 12రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు 8 రౌండ్లలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉండగా.. 3 రౌండ్లలో టిఆర్ఎస్ అభర్ధి సోలిపేట సుజాత లీడ్ లో ఉన్నారు. కాగా, 12వ రౌండ్ లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 12వ రౌండ్ లో కాంగ్రెస్ 83 ఓట్ల ఆధిక్యం సాధించింది. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం తుక్కాపూర్ లో ఆధిక్యంలో ఉన్నారు. 12వ రౌండ్ లో కాంగ్రెస్ కు 2080, బిజెపికి 1997, టిఆర్ఎస్ కు 1900 ఓట్లు వచ్చాయి. అయితే మొత్తంగా చూస్తే బిజెపి దూసుకుపోతోంది.
Dubbaka by-election result 2020 Live
- Advertisement -