Thursday, April 18, 2024

అక్కడ ఈ పాస్‌లున్నవారికే అనుమతి: డిజిపి

- Advertisement -
- Advertisement -

E passes person allowed into telangana boarder

సంగారెడ్డి: తెలంగాణ సరిహద్దులోకి ఈ పాస్‌లు ఉన్నవారినే మాత్రమే అనుమతి ఇస్తున్నామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఒఆర్‌ఆర్ వద్ద చెక్‌పోస్టును డిజిపి పరిశీలించారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పకడ్బందీగా లాక్‌డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలని, లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాలు, కమిషనరేట్‌లకు సూచించామని, పారిశ్రామి వాడలోని ఫార్మా అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఇతర రంగాల వారు లాక్‌డౌన్ సడలింపు సమయంలో పనులు చేసుకోవాలని డిజిపి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News