Tuesday, April 23, 2024

ఇండోనేషియాలో భూకంపం… నిప్పులు కక్కిన అగ్నిపర్వతం: 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Earth quake in India

జకర్తా: ఇండోనేషియాలో ఆదివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా ఉంది జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. టోబెలో ప్రాంతానికి ఉత్తర వైపు 259 కిలో మీటర్ల దూరంలో భూకంపం ఉందని, 174.3 కిలో మీటర్ల లోతున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సునామీ వచ్చే అవకాశం లేదని భూగర్భ పరిశోధన అధికారులు వెల్లడించారు.

జావా ప్రాంతంలో అగ్ని పర్వతం బద్దలు కావడంతో 13 మంది మృతి చెందగా 50 మంది పైగా గాయపడినట్టు సమాచారం. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిప్పులు కక్కుతూ భయటకు రావడంతో స్థానికులు పరుగులు తీశారు. మబ్బులాగా ఆ ప్రాంతమంతా కమ్ముకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News