Thursday, April 25, 2024

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

Earthquakes in several parts of Telangana

హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం స్వల్ప భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి , రామగుండం, లక్షెట్టిపేటలో ఆదివారం సాయంత్రం 6.49 గం.కు 3 సెకన్లపాటు భూమి కంపించింది. భూప్రకంపనలతో జగిత్యాల, రామగుండం ప్రజలు ఉలిక్కిపడ్డారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోనూ భూమి స్వల్పంగా కంపించింది. గోదావరి పరివాహక గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో గల రహమత్‌పురాలో ప్రకంపనలు వచ్చాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూరు, సలుగుపల్లి గ్రామాల్లో భూమి కంపించింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. ఒక సెకను పాటు కంపించిన భూమి కంపించింది. బెల్లంపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాలతో పాటు లక్సెట్టిపేటలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం, ముత్తారం మండలాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News