Wednesday, April 24, 2024

ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Rape

మనతెలంగాణ/మేడిపల్లి : ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, పసునూర్‌లో గురువారం చోటుచేసుకుంది. పసునూర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన బెజ్జంకి గంగారాం ఆనే 50 ఏళ్ల వ్యక్తి చాక్లెట్ ఇస్తానంటూ బాలికను గ్రామ పంచాయతీ భవనంలోకి తీసుకెళ్లాడు. బాలిక అక్క ఇంటికి చేరుకోగా చెల్లెలు ఎందుకు రాలేదని తల్లి ప్రశ్నించింది. గంగారాం మామ చెల్లిని పంచాయతీ ఆఫీసులోకి తీసుకెళ్లాడని చెప్పింది. వెంటనే వెళ్లి చెల్లిని తీసుకురమ్మని తల్లి చెప్పడంతో ఆమె చెల్లెను తీసుకువచ్చేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లింది.

కార్యాలయం తలుపులకు లోపలికి గడియ వేసి ఉండడంతో తలుపు తీయమంటూ బాలిక అరవగా కొద్దిసేపటికి గంగారాం తలుపు తీసి చిన్నారిని బయటకు పంపించాడు. ఇంటికి చేరిన చిన్నారిని తల్లి ఆఫీసులో గంగారాం మామ ఏం చేశాడంటూ ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని చిన్నారి తల్లికి వివరించింది. ఈ విషయాన్ని ఇంటి పక్కనే ఉంటున్న అంగన్‌వాడీ టీచర్‌కు తెలపడంతో ఆమె చిన్నారిని పరిశీలించి అత్యాచారానికి గురైనట్లు తెలిపింది. దాంతో మేడిపల్లి ఎస్సైకి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో మెట్‌పల్లి డిఎస్‌పి గౌస్ బాబా, కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, ఎస్సై శ్రీనివాస్‌లు హుటాహుటిన గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Eight Year Old Child Raped At Jagityal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News