Wednesday, April 24, 2024

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలు విడుదల చేసిన ఎన్నికల సంఘం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలను విడుదల చేసింది. ఇటీవల ఓటర్ల సవరణ పూర్తయిన నేపథ్యంలో, తెలంగాణ, ఏపీలకు సంబంధించి నూతన జాబితాలు రూపొందించింది. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరువ కాగా, ఏపీలో 4 కోట్లకు దరిదాపులో ఉంది. ప్రతి సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం సవరణల అనంతరం జనవరిలో ఓటర్ల తుది జాబితాలను ప్రకటించడం ఆనవాయతీ. తాజాగా ప్రకటించిన జాబితాల ప్రకారం….

తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య- 2,99,92,941
  • పురుష ఓటర్ల సంఖ్య- 1,50,48,250
  • మహిళా ఓటర్ల సంఖ్య- 1,49,24,718
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 1,951
  • సర్వీసు ఓటర్ల సంఖ్య- 15,282
  • హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య- 42,15,456
  • రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 31,08,068
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఓటర్ల సంఖ్య- 25,24,951
  • అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి (6,44,072)
  • అతి తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న నియోజకవర్గం భద్రాచలం (1,42,813)
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 3,99,84,868
  • ఏపీలో మహిళా ఓటర్ల సంఖ్య- 2,02,19,104
  • ఏపీలో పురుష ఓటర్ల సంఖ్య- 2,01,32,271
  • ఏపీలో సర్వీసు ఓటర్ల సంఖ్య- 68,162
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య- 3,924
  • అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా కర్నూలు (19,42,233)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News