Saturday, April 20, 2024

సెలవు ఇవ్వడంలేదని ఉద్యోగి ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

Employee commit suicide in medchal

మేడ్చల్: పని చేస్తున్న కంపెనీలో సెలవు ఇవ్వడంలేదని ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి పక్కన ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా మృతుడి జేబులో లేఖ ఉంది. సూర్యవంశీ అనిల్ కుమార్ యాదవ్ (43) శంషాబాద్ లోని ఓ కొరియర్ సంస్థలో పని చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అనిల్ కు సెలవు కావాలని తన కంటే పైస్థాయిలో ఉన్న ఉద్యోగులను బతిమాలాడు. వారు సెలవు ఇవ్వకపోగా అతడిని వేధిస్తుండడంతో మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకున్నట్టు లేఖలో ఉంది. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News