Thursday, April 25, 2024

పైఅధికారులకు ఫిర్యాదు చేశాడని…. తలను తీసేశాడు…

- Advertisement -
- Advertisement -

Employee killed his colleague

లక్నో: సహోద్యోగి తనపై పైఅధికారులకు ఫిర్యాదు చేశాడని అతడిని చంపి… మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రమోద్ కుమార్, సందీప్ మిశ్రా అనే వ్యక్తులు ఆటో మొబైల్ కంపెనీలో పని చేస్తున్నారు. ప్రమోద్ పలుమార్లు సందీప్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కక్ష్య పెంచుకున్నాడు. దీంతో ప్రమోద్ ను అంతం చేయాలని సందీప్ అనుకున్నాడు. ఆదివారం పార్టీ ఉందని తన ఇంటికి ప్రమోద్ ను సందీప్ పిలిచాడు. ప్రమోద్ కు పూటుగా మద్యం తాగించాడు. అనంతరం కత్తితో కసితీరా తల నరికేశాడు. ప్రమోద్ మొండెం పక్కనే సందీప్ ఆ రాత్రి పడుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున తల ప్లాస్టిక్ కవర్ లో పెట్టి సమీపంలో ఉన్న చెత్త కుప్పలో పడేశాడు. కాసగంజ్ లో ఉంటున్న ప్రమోద్ భార్య ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో డైరెక్ట్ గా సందీప్ ఇంటికి చేరుకుంది. భర్త మొండెం కనిపించడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News