Wednesday, April 24, 2024

జమ్మూకశ్మీర్‌లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌..

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్‌ ప్రాంతంలోని పెత్‌సీర్‌లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో కశ్మీర్‌ జోన్‌ పోలీసులు, భద్రతా బలగాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు తప్పించుకోకుండా గ్రామాన్ని నలువైపులా చుట్టుముట్టి ఉగ్రవాదులను పట్టుకునేందు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కశ్మీర్‌లో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు.

Encounter between Soldiers and Terrorists in Baramulla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News