- Advertisement -
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్ ఎ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది హతమయ్యాడు. చనిపోయిన ఉగ్రవాదిని నసీర్ అలియాస్ షకీల్సాబ్గా గుర్తించామని పోలీస్ అధికారులు తెలిపారు. ఇతడు విదేశీయుడని, ఐఇడి బాంబుల తయారీలో నిపుణుడని వారు తెలిపారు. అనంత్నాగ్లోని లార్నూ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ ఘటన జరిగిందని వారు తెలిపారు.
- Advertisement -