Thursday, April 25, 2024

కెసిఆర్ అభివృద్ధి ఫలాల కోసం దేశ ప్రజల ఎదురు చూపు :జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : వ్యవసాయానికి బీజేపీ హయాంలో తెలంగాణాకు ఎక్కువ నిధులు కేటాయించామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ల వ్యాఖ్యల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైరయ్యారు . కిషన్ రెడ్డి , బండి సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితి లేదని అన్నారు. వారిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని హెద్దేవా చేశారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ల కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న మోడీ యత్నాన్ని దేశ రైతులు ప్రతిఘటించగా క్షమాపణ చెప్పిన విషయం ను గుర్తుంచుకోవాలని విమర్శించారు. మోడీ రైతు విధానాలు నచ్చక నెలల పాటు రైతులు రోడ్డెక్కితే మాది రైతు ప్రభుత్వం అనడం సిగ్గుచేటని మంత్రి అన్నారు. ఢిల్లీలో రైతులు మోడీ గో బ్యాక్ అంటుంటే- తెలంగాణా సరిహద్దు రైతులు మమ్మల్ని తెలంగాణాలో కలపండి అని అడుగుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ కి తెలంగాణాకు ఉన్న తేడా ఇదే అని అన్నారు. కేసీఆర్ అభివృద్ధి ఫలాల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని అందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News