సౌతాంప్టన్: కరోనా కారణంగా పూర్తిగా చతికిల పడిన ప్రపంచ క్రికెట్కు వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగనున్న టెస్టు సిరీస్ కొత్త దిశను చూపుతుందనడంలో సందేహం లేదు. సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ సందడి మళ్లీ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. కరోనా నేపథ్యంలో బయో సెక్యూర్ పద్ధతిలో సిరీస్ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్లో ఎన్నో కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఈ నిబంధనలకు సిరీస్లోనే తెరలేవనుంది. ఇక, సిరీస్లో పాల్గొంటున్న క్రికెటర్లకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఖాళీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇక, మ్యాచ్ నేపథ్యంలో ఇంగ్లండ్ బోర్డు పలు జాగ్రత్తలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమనిబంధనలకు అనుగుణంగానే సిరీస్ను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. సిరీస్పై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి నిలిచింది. కరోనా మహమ్మరి బయట పడిన తర్వాత జరుగుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, తొలి టెస్టు మ్యాచ్ కోసం ఇటు వెస్టిండీస్ అటు ఇంగ్లండ్ జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. రెగ్యూలర్ కెప్టెన్ జో రూట్ లేకుండానే ఇంగ్లండ్ మొదటి మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో రూట్ ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో స్టార్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్ జట్టుకు సారథ్యం వహిస్తాడు. యువ ఆల్రౌండర్ శామ్ కరన్ కూడా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఇక హోల్డర్ సారథ్యంలోని విండీస్ కూడాభారీ ఆశలతో మ్యాచ్కు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
Eng vs WI Test Series 2020 Start from July 8