Friday, April 26, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

- Advertisement -
- Advertisement -

England Won The Toss Elected To Bat

అహ్మదాబాద్: మొతేరా స్టేడియం వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ లో రెండోసారి డే నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్నారు. 2019లో ఈడెన్ గార్డెన్స్ లో తొలి డే నైట్ టెస్టు నిర్వహించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. సిరాజ్, కుల్ దీప్ స్థానంలో జట్టులోకి బుమ్రా, వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారు. పేసర్ ఇషాంత్ శర్మ తన కెరీర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. 100 టెస్టుల మైలురాయిని అందుకున్న భారత రెండో ఫాస్ట్ బౌలర్ గా ఇషాంత్ ఘనత సృష్టించాడు.

England Won The Toss Elected To Bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News