Friday, April 19, 2024

11న గురుకుల సైనిక్ విద్యాలయాల ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

Entrance test of Gurukul Sainik Vidyalayas on 11th

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ పర్యవేక్షణలో కరీంనగర్ జిల్లా రుక్కాపూర్‌లో ప్రారంభించిన సాంఘిక సంక్షేమ సైనిక విద్యాలయం, నర్సంపేటలోని అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన గిరిజన సైనిక విద్యాలయం 2021 -2022 విద్య సంవత్సరానికి 6వ తరగతి, ఇంటర్ (ఎంపిసి) బాలుర ప్రవేశాల కోసం ఈ నెల 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు సంస్థ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్ధులు తమ హాల్ టికెట్లను https://tswreis.in, https://tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్ నుండి పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని, విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News